నటి అదా శర్మ (Ada Sharma) తాను నటించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదల తర్వాత ఎదుర్కొన్న తీవ్ర బెదిరింపుల గురించి సంచలన విషయాలు వెల్లడించారు. ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) వచ్చిన తర్వాత దేశంలో సగం మంది తనను చంపాలని చూశారని, అయితే అదే సమయంలో మిగతా సగం మంది తనకు మద్దతుగా నిలిచి రక్షించారని ఆమె తెలిపారు. రిస్క్తో కూడిన పాత్రలు చేసినప్పుడే కెరీర్కు విలువ వస్తుందని ఆమె అన్నారు.
‘ది కేరళ స్టోరీ’ సినిమా తర్వాత తన కెరీర్ పూర్తిగా మారిపోయిందని అదా శర్మ వెల్లడించారు. ఆ చిత్రం తర్వాత తాను నటించిన ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ చిత్రాల సమయంలోనూ తీవ్రమైన బెదిరింపులు ఎదుర్కొన్నట్లు ఆమె పేర్కొన్నారు. తాను ‘1920’ సినిమాతో పరిశ్రమలోకి వచ్చానని, ఆ తొలి చిత్రమే ఒక పెద్ద సాహసమని అదా అన్నారు. మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూసి ‘ది కేరళ స్టోరీ’ చేసి, దాని తర్వాత బెదిరింపులతో పాటు ప్రశంసలను కూడా పొందానని తెలిపారు.
తన స్క్రిప్ట్ ఎంపిక గురించి వివరిస్తూ, సవాలుతో కూడిన పాత్రలనే తాను ఇష్టపడతానని అదా స్పష్టం చేశారు. తన పాత్రలో భావోద్వేగం (ఎమోషనల్ టచ్), యాక్షన్ సన్నివేశాలు తప్పనిసరిగా ఉండాలని, ఆ పాత్ర చూసి తన కుటుంబం కాస్త ఆందోళన చెందాలని ఆమె అభిప్రాయపడ్డారు. అలాంటి అంశాలు లేకపోతే ఆ పాత్ర ఎందుకు చేయాలనిపిస్తుందని ప్రశ్నించారు. మొత్తంగా, కెరీర్లో రిస్క్ తీసుకోవడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని అదా శర్మ పేర్కొన్నారు.