హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ‘ఎన్టీఆర్ 31’ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అయితే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్, క్యాప్షన్ ఆధారంగా 1969లో మహారాష్ట్ర తారాపూర్లో ప్రారంభమైన తొలి వాణిజ్య అణు విద్యుత్ కేంద్రం చుట్టూ కథ నడుస్తుందంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. అందులో ఎన్టీఆర్ కార్మికుడిగా పనిచేస్తారేమోనంటూ ఊహించుకుంటున్నారు. అయితే దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.