కెసిఆర్ పై ధ్వజ ఎత్తిన కల్వకుర్తి ఎమ్మార్పీఎస్ నాయకులు

నాగర్ కర్నూల్ జిల్లా  కల్వకుర్తి పట్టణం లో అంబెడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం MRPS నాయకులూ మాట్లాడుతూ  ఏప్రిల్ 13న పంజాగుట్ట లో  ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి ముక్కలు ముక్కలుగా చేసి  చెత్తకుప్పలో పడేయడాన్ని  ఖండిస్తూ 14న అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సీ.ఎం. కేసీఆర్ పాల్గొనక పోవడాన్ని చాల విషాదకరమైన విషయమని అన్నారు .   ఏప్రిల్ 27న హైదరాబాబు లో జరగనున్న  మహా గర్జన సభను జయప్రదం చేయాలనీ MRPS  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  మబ్బు సాయన్న మాదిగ కోరారు .  మందకృష్ణ మాదిగ ను   గృహ నిర్బంధం చేసినందుకు నిరసనను తెలిపారు  . ఈ  కార్యక్రమంలో  గూటం విజయ్ మాదిగ ,  చిన్న. శేఖర్. రాజు.మల్లయ్య. జంగయ్య. రాజేందర్. జగన్. రమేష్ చారి. బంగారి. సత్యనారాయణ. కేశవులు. గోవింద్, ఆంజనేయులు. సంతోష్. నిరంజన్. మల్లేష్. శేఖర్ గౌడ్. శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *