మల్యాలలో నిర్మించే రామమందిర నిర్మాణానికి విరాళాల వెల్లువ.

తేది: 18-04-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.

జగిత్యాల జిల్లా : మల్యాల మండల కేంద్రంలోని రామగిరి ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన రామ మందిర నిర్మాణానికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. ఆలయ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి భక్తులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున నిధులను అందజేస్తున్నారు. నిధుల సేకరణను ప్రారంభించి నేటితో 6 రోజులు పూర్తి చేసుకోగా ఇప్పటివరకు సుమారు రూ. 10 లక్షలకు పైగా నిధులు సమకూరాయి. స్థానిక విద్యానగర్ కాలనీకి చెందిన భూక్య రాజేందర్, నూతనంగా నిర్మించే ఆలయంలో ధ్వజస్తంభం ఏర్పాటు చేయడానికి శనివారం తమ వంతుగా రూ. 2,01,116 అందజేయడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *