కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సంచలన ఘటన వెలుగుచూసింది. దుర్కి పోస్టాఫీస్కు చెందిన బ్రాంచ్ పోస్ట్మాస్టర్ బత్తుల మునీశ్వర్ చైన్ స్నాచింగ్కు పాల్పడగా, పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
దర్యాప్తులో మునీశ్వర్ దుర్కి పోస్టాఫీస్కు చెందిన సుమారు రూ.12 లక్షలను ఫ్రాడ్ చేసి, ఆ మొత్తాన్ని ఆన్లైన్ గేమింగ్లో కోల్పోయినట్లు వెల్లడైంది. అనంతరం బంధువుల వద్ద నుంచి సుమారు రూ.11.5 లక్షలు తీసుకుని పోస్టాఫీస్ అధికారులకు చెల్లించాడు. ఈ ఘటన నేపథ్యంలో అధికారులు 10 రోజుల క్రితమే అతడిని సస్పెండ్ చేశారు.
పోస్టాఫీస్కు ఇంకా బాకీ ఉన్న రూ.42 వేల కోసం మునీశ్వర్ బాన్సువాడలో ఓ కిరాణా దుకాణానికి వెళ్లి, తాను ఎక్సైజ్ కానిస్టేబుల్నని చెప్పి చైన్ స్నాచింగ్కు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి 23 గ్రాముల బంగారు గొలుసు, ఒక బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ విఠల్ రెడ్డి తెలిపారు.