తేది:22-04-2026, తెలంగాణ TSLAWNEWS ఇంచార్జ్ గౌండ్ల రమేష్ గౌడ్.
నాగర్ కర్నూల్ జిల్లా: నాగర్ కర్నూల్ ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకతను పెంచేందుకు, అవినీతి రహిత సమాజ స్థాపన కోసం ‘సమాచార హక్కు చట్టం-2005’ను జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తిస్థాయిలో అమలు చేయాలని కౌన్సిల్ ఫర్ సిటిజన్స్ వాయిస్ (CCV)డిమాండ్ చేసింది.
ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లాలో సంస్థ కార్యకలాపాలను అత్యంత ఉత్సాహంగా, అంకితభావంతో ప్రారంభించిన జిల్లా కార్యవర్గానికి CCV కేంద్ర కార్యవర్గం హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేసింది. ప్రజల గొంతుకగా, సామాన్యుడి ఆయుధంగా క్షేత్రస్థాయిలో బాధితులకు అండగా నిలుస్తున్న నాగర్ కర్నూల్ టీమ్ స్ఫూర్తితో.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో స్పష్టమైన కార్యాచరణతో (Action Plan) సంస్థను విస్తరిస్తామని కేంద్ర కమిటీ ప్రకటించింది.
ముఖ్యమైన డిమాండ్లు & అంశాలు:
RTI అమలు: ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన సూచిక బోర్డులను ఏర్పాటు చేసి, చట్టం సమర్థవంతంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి.
పారదర్శక పాలన: పారదర్శకమైన పాలన అందించడం మరియు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కుల పట్ల అవగాహన కల్పించడమే CCV ప్రధాన లక్ష్యం.
బాధితులకు అండగా: సమస్య ఎక్కడ ఉన్నా, అక్కడ బాధితులకు అండగా నిలబడి ‘వాయిస్’ వినిపిస్తామని సభ్యులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా సభ్యులు ఎస్. శ్రీనివాస్, ఏ. తిరుపతయ్య మరియు ఇతర ముఖ్య సభ్యులు పాల్గొని, ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు సాగుతామని తెలిపారు.