ఆటోమేటిగ్గానే 3 నెలల మారటోరియం వర్తింపు

కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశంలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి కారణంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నెలవారీ రుణ వాయిదా (ఈఎంఐ) చెల్లింపుల మీద మూడు నెలల మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. మన దేశంలో చాలా వరకు ఈఎంఐలు ప్రతి నెలా మొదటి వారంలో ఆటోమేటిక్‌గా కస్టమర్‌ బ్యాంక్‌ ఖాతా నుంచి కట్‌ అవుతుంటాయి. ఈఎంఐను దృష్టిలో పెట్టుకొని ఖాతాలో నగదు నిల్వ ఉంచుకుంటారు. అయితే ఆర్‌బీఐ మారటోరియం నేపథ్యంలో సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌లో మూడు నెలల మారిటోరియంను లాక్‌ చేశామని, దీంతో ఆటోమేటిక్‌గా ఈఎంఐ నిలిచిపోతుందని ఎస్‌బీఐకి చెందిన సీనియర్‌ అధికారి ఒకరు  తెలియజేశారు. ఒకవేళ ఈఎంఐ కట్‌ అయితే గనక ఆందోళన చెందవద్దని.. సంబంధిత మొబైల్‌ సందేశాన్ని బ్యాంక్‌ శాఖకు మెయిల్‌ ద్వారా తెలియజేస్తే.. తిరిగి ఖాతాలో సొమ్ము జమ అవుతుందని వెల్లడించారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *