నేడు తెలంగాణ మంత్రిమండలి సమావేశం : మే 7 వరకు లాక్ డౌన్


తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రిమండలి సమావేశమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతను ప్రగతిభవన్‌లో ఈ భేటీ ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ ఆంక్షలు ఏప్రిల్‌ 20 నుంచి కొంతమేర సడలింపు ఇస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి పలు మార్గదర్శకాలను సైతం కేంద్రం విడుదల చేసింది. అయితే నేడు జరగబోయే రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో ముఖ్యంగా వీటిపైనే చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే  ఎజెండా కూడా తయారు చేశారని, కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలపై సీఎం కేసీఆర్‌ గడిచిన రెండు రోజులుగా అధికారులతో సమీక్షలు జరుపుతున్నట్లు సమాచారం. సమీక్ష అనంతరం  మే 7 వరకు లాక్ డౌన్ కొనసాగించనున్నట్లు వెల్లడించిన సీఎం కేసీఆర్ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *