అప్రమత్తమైన ఎన్ఐఏ.. 17 చోట్ల సోదాలు..

దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. 2013లో బెంగళూరు జైలు నుంచి ఉగ్రవాదుల పరారీ కేసు, రామేశ్వరం కేఫ్ ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌తో పాటు మరో 17 ప్రాంతాల్లో ఉదయం నుంచి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. పలు కేసుల్లో నిందితులకు నిషేధిత సంస్థలతో ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *