రాష్ట్రంలో తాకట్టు పెట్టడానికి ఏదీ అనర్హం కాదన్నట్టు వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. గుంటూరులో జరిగిన ప్రజాపోరు బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. జగన్ ఏదో ఉద్ధరిస్తారని ప్రజలు గెలిపిస్తే ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలపై రూ.12లక్షల కోట్ల అప్పుల భారం మోపారని ఆరోపించారు. ప్రజల సొమ్ముతో కట్టిన భవనాలను తాకట్టు పెట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.