ఆంధ్రప్రదేశ్ లో వేసవి తాపం రోజు రోజుకు పెరిగిపోతోంది. ఎల్నివో ప్రభావంతో రాష్ట్రంలో మే వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని, వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. IMD హెచ్చరికల మేరకు వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.