పాకిస్థాన్కు భారత్ భారీ షాక్ ఇచ్చింది. షాపూర్ కంది బ్యారేజ్ నిర్మాణం తుదిదశకు చేరుకోవడంతో పాకిస్థాన్కు వెళ్తున్న రావి నది నీటి ప్రవాహాన్ని నిలిపేసినట్లు తెలుస్తోంది. రావి నది ద్వారా పాకిస్థాన్లోకి ప్రవేశించే 1150 క్యూసెక్కుల నీటిని ఇప్పుడు జమ్మూకశ్మీర్లోని కథువా, సాంబా జిల్లాల్లోని 32,000 హెక్టార్ల భూమికి సాగు నీరుగా ఇవ్వనున్నారు. కాగా.. ఇటీవలే ‘చీనాబ్’ నీటిని కూడా భారత్ సమర్థవంతంగా వినియోగించాలని నిర్ణయించుకుంది.