ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ప్రధాన రాజకీయ పార్టీలు సమరశంఖాన్ని పూరిస్తున్నాయి. రాయలసీమలో న్యాయ సాధన సభ పేరుతో కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఉత్తరాంధ్రలో ‘రా కదలి రా’ అని చంద్రబాబు అంటున్నారు. వైసీపీ కూడా అదే పంథాతో ముందుకు సాగుతోంది. కానీ బీజేపీ మాత్రం ఢీలా పడింది. అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనతో టీడీపీ-జనసేనలో కొత్త జోష్ కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారమే ధ్యేయంగా టీడీపీ ప్రణాళికలు రచిస్తోంది.