గురజాల వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అధిష్టానానికి తలనొప్పిగా మారారు. పేరుకు ఎమ్మెల్సీ అయినా అతడిని పార్టీ గుర్తించలేదు. ఎలాంటి కార్యక్రమాలు జరిగినా పక్కనపెట్టేవారు. దాంతో అంతా మౌనంగా భరించిన జంగా.. ఇప్పుడు పార్టీకే తలనొప్పిగా మారాడు. ఏడాదిగా నియోజకవర్గంలో బీసీ సంఘాలతో సమావేశాలు జరుపుతూ.. జంగా బలం కూడబెట్టుకున్నాడు. ప్రస్తుతం గురజాల టీడీపీ టికెట్ జంగాను వరించే పరిస్థితి వచ్చింది. త్వరలోనే జంగా వైసీపీని వీడి టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.