రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో రైతుబంధు, రైతు బీమా పేరుతో డబ్బును కాజేసిన ఏఈవోను పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులు చనిపోయినట్లుగా తప్పుడు ధృవ పత్రాలతో రైతుబంధు, రైతు బీమా నిధులను మళ్లించినట్లుగా ఉన్నతాధికారులు గుర్తించారు. గత 4 ఏళ్లుగా 20 మంది రైతుల పేరుతో రూ.2 కోట్ల నిధులు కాజేనట్లుగా తెలుస్తోంది. ఎల్ఐసీ అధికారుల ఫిర్యాదుతో విషయం బయటపడింది. ఏఈవోను విచారించగా నిధులు కాజేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.