మరోసారి నాగార్జునసాగర్ డ్యామ్ వివాదం తెరపైకి వచ్చింది. డ్యామ్ కు మరమ్మతు పనులను తెలంగాణ సర్కార్ ప్రారంభించింది. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు డ్యామ్ కు మరమ్మతులు చేపట్టడం ఏంటని ఏపీ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే మరమ్మతు పనులు అపాలని కోరుతూ కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో గురువారం నాగార్జున సాగర్ డ్యాము కేఆర్ఎంబీ బృందం సందర్శించి పరిస్థితి సమీక్షించారు.