6 వేల మందికి పైగా దర్శనం – రూ.8 లక్షల ఆదాయం..

వేములవాడ: వేసవి సెలవులను పురస్కరించుకుని వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం బుధవారం భక్తులతో రద్దీగా కనిపించింది. వేకువజాము నుంచే భక్తులు ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కోడెమొక్కు తీర్చుకున్నారు. స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో వివిధ ఆర్జితసేవల ద్వారా రాజన్నకు సుమారు రూ.8 లక్షల ఆదాయం సమకూరినట్లు, రాజన్నను సుమారు 6 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *