ఇంటర్ ఎఫెక్ట్ : ఉన్నత విద్యలో సంస్కరణలకు పూనుకున్న విద్యా మండలి..

 

రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో విద్యామండలి చైర్మన్ ఆచార్య పాపిరెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, వైస్ చైర్మన్లు లింబాద్రి సమావేశమై.. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిపై చర్చించారు.

తెలంగాణ ఇంటర్ ఫలితాల వెల్లడిలో జరిగిన అవకతవకలు మొత్తం విద్యాశాఖపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలోనూ ఎలాంటి తప్పిదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఉన్నత విద్యామండలి పూనుకుంది. ఇందుకోసం రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో విద్యామండలి చైర్మన్ ఆచార్య పాపిరెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, వైస్ చైర్మన్లు లింబాద్రి సమావేశమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *