రాష్ట్రంలో కొన్ని ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ రానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయా శాఖల అధికారులు ప్రతిపాదనలు పంపారు. కొల్లాపూర్ మామిడి, బాలానగర్ సీతాఫలం, నిజామాబాద్ పసుపు, నల్లగొండ పచ్చడి దోసకాయ ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ కోసం పరిశీలనకు పంపారు. అయితే ఇప్పటికే హైదరాబాద్ హలీం, తాండూరు పప్పు, పోచంపల్లి ఇక్కత్, సిద్దిపేట గొల్లబామ చీరలు వంటి చాలా ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ ఉంది.