రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన ఎన్నికల బాండ్ల పథకం చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో.. సీల్డ్ కవర్లో 2023 సెప్టెంబర్ 30 వరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన నిధుల వివరాలు ఇవ్వాలని ఈసీని ఆదేశించింది.