ఎటూ తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు..!

ఏపీలో త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై టీడీపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇప్పటికే వైసీపీ తమ పార్టీ తరఫున ముగ్గురు అభ్యర్ధుల్ని ఖరారు చేసి బీఫామ్ లు కూడా ఇచ్చేసింది. దీంతో ఎమ్మెల్యేల బలం లేని టీడీపీ సతమతమవుతోంది. మంగళవారం చంద్రబాబు మరోసారి ఇదే అంశంపై పార్టీ సీనియర్లతో చర్చలు జరిపారు. వైసీపీ మార్పుల్లో నిరాశకు గురైన ఎమ్మెల్యేలు తమవైపు ఫిరాయిస్తారనుకుంటే.. వారు ఆశించిన స్థాయిలో స్వరం పెంచకపోవడంతో బాబు క్లారిటీకి రాలేకపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *