ప్రజావాణి పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి……..

దిల్లీ: మాజీ ప్రజాప్రతినిధి సుంకరి సత్యనారాయణ ప్రసంగాలు నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సుంకరి ప్రసంగాలతో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ రాసిన గ్రామీణ ప్రజావాణి పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి దిల్లీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, సీవీసీ కేవీ చౌదరి, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. గ్రామీణ సమస్యలపై సుంకరి సత్యనారాయణ అలుపెరగని పోరాటం చేశారని ఈసందర్భంగా వక్తలు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *