ఇవాళ లక్ష మందికి ప్రధాని అపాయింట్‌మెంట్ లెటర్లు..

కేంద్రప్రభుత్వ శాఖల్లో నియమితులైన లక్ష మందికిపైగా అభ్యర్థులకు ప్రధాని మోదీ సోమవారం ఉపాధి మేళాలో నియామకపత్రాలను అందజేయనున్నారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా నియమితులైన లక్ష మందికిపైగా అభ్యర్థులకు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ లెటర్లను పంపిణీ చేస్తారని పీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 47 చోట్ల ఈ ఉపాధి మేళా నిర్వహించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *