సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లి గ్రామంలో హనుమాన్ భక్తుల పూజలు..ఘనంగా నిర్వహించారు హనుమాన్ భక్తులు శోభాయాత్ర నిర్వహించి గ్రామంలోని మాడవీదుల వెంబడి తిరుగుతూ కాషాయ జెండాలు పట్టుకుని శ్రీరామ జయరామ అంటూ రామస్మరణతో మారుమ్రోగించారు. మంగళవారం శోభాయాత్ర అనంతరం సిద్దప్ప వరకవి ఆశ్రమంలో గల హనుమాన్ దేవాలయం వద్ద అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేసారు. అంజన్న భక్తులు భజన పాటలతో ఆకట్టుకున్నారు ఆలయం వద్ద మంగళవారం రోజున మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు