ఆంధ్ర ప్రదేశ్ : రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ పరీక్షలునిర్వహిస్తున్న నేపథ్యంలో, కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలోకి దూసుకెళ్లింది. వివిధ రాష్ట్రాల్లో జరిగిన నిర్ధారణ టెస్ట్ల గణాంకాలు చూస్తే రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. భారతదేశంలో పది లక్షల మంది జనాభాకు సగటున 334 టెస్టులు చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ 830 టెస్ట్లు చేసింది. నాలుగు రోజులుగాఏపీ ఎక్కువ సంఖ్యలో టెస్ట్లు చేస్తూ వచ్చాయి. వారం రోజుల క్రితం 5వ స్థానంలో ఉన్న ఏపీ.. టెస్ట్ల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుని మొదటి స్థానానికి చేరుకుంది. ప