‘కేఏ పాల్ మోసం చేశారు’…చీటింగ్ కేసుపెట్టిన మహిళ….

 K.A.Paul: డబ్బులు తీసుకున్న తర్వాత స్పాన్సర్‌షిప్ లెటర్‌ని ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని సత్యవతి ఆరోపించారు. ఈ విషయమై పాల్ అనుచరులను పలుమార్లు ప్రశ్నించినా..అటు వైపు నుంచి స్పందన సరిగా లేకపోవడంతో పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు సత్యవతి.

Image result for k.a paul   

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదయింది. అమెరికా పంపిస్తానని డబ్బులు తీసుకొని తనను మోసం చేశాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం.. తాను అమెరికా వెళ్లేందుకు సాయం చేయాల్సిందిగా రామచంద్రాపురానికి చెందిన సత్యవతి అనే మహిళ కేఏ పాల్‌ని ఆశ్రయించారు. అమెరికా వెళ్లేందుకు విజిట్ వీసా, స్పాన్సర్‌షిప్‌ లెటర్ అందిస్తానని కేఏ పాల్ పాల్ అనుచరులు రూ.15 లక్షలు డిమాండ్ చేశారు. ఇప్పటికే రూ.2లక్షల చెక్కును ఇచ్చాచని..ఆ డబ్బును బ్యాంకు నుంచి కూడా డ్రా చేశారు. 
డబ్బులు తీసుకున్న తర్వాత స్పాన్సర్‌షిప్ లెటర్‌ని ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని సత్యవతి ఆరోపించారు. ఈ విషయమై పాల్ అనుచరులను పలుమార్లు ప్రశ్నించినా..అటు వైపు నుంచి స్పందన సరిగా లేకపోవడంతో పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు సత్యవతి. ఆమె ఫిర్యాదు మేరకు కేఏ పాల్‌తో పాటు విజయ్, జ్యోతిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *