ఇటీవల జరిగిన ఎన్నికల్లో పరిటాల కుటుంబం దారుణ ఓటమిని చవిచూసింది. పరిటాల శ్రీరామ్ రాప్తాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తాజాగా ఏర్పాటు కానున్న కొత్త ప్రభుత్వం పరిటాల కుటుంబానికి అదనపు భద్రతను ఏర్పాటు చేసింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈలోగానే ఆయన పోలీసు ఉన్నతాధికారులతో శాంతిభద్రతలపై సమీక్షించారు. పరిటాల కుటుంబానికి అదనపు భద్రతను కల్పించాలని ఆయన ఆదేశించారు. దీంతో పరిటాల కుటుంబానికి ప్రస్తుతం ఉన్న గన్ మెన్లతో పాటు అదనంగా ఎనిమిది మంది గన్ మెన్లను ఏర్పాటు చేయడం విశేషం. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పకూడదన్న జగన్ నిర్ణయాన్ని అధికారులు అప్పుడే అమలులో పెట్టేశారు.