అయోధ్య మందిరంలోకి రాముడు.. గర్భగుడిలో ప్రత్యేక పూజలు..

అయోధ్యలోని రామమందిరంలోకి శ్రీరామ్‌లల్లా అడుగుపెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరం గర్భగుడిలోకి రాముడి విగ్రహాన్ని తీసుకొచ్చారు. క్రేన్ సహాయంతో విగ్రహాన్ని లోపలికి తీసుకొచ్చారు. అంతకు ముందు గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయాన్ని శ్రీరామ్‌ జన్మభూమి తీర్థక్షేత్ర అధికారికంగా ప్రకటించింది.

 

అయోధ్య రామ మందిరంలో ఉండే రామ్ లల్లా విగ్రహాన్ని, మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. బ్లాక్ స్టోన్తో తయారుచేసిన ఈ విగ్రహ బరువు 150 నుంచి 200 కేజీల మధ్య ఉంటుంది.

 

శ్రీరామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న జరగనుంది. జనవరి 16 నుంచే ప్రాణప్రతిష్ఠ పూజలు ప్రారంభమయ్యాయి.ఈ నేపధ్యంలో అయోధ్య నగరమంతా రామమయంగా మారిపోయింది. ప్రతిచోటా జై శ్రీరామ్ నినాదాలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *