మీ పతనం మొదలైంది: కేటీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ

మీ పతనం మొదలైంది: కేటీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ కు లేఖాస్త్రం సంధించారు. తెలంగాణలో మీ పతనం మొదలైంది, సిద్ధిపేట, సిరిసిల్లలే మీ పతనానికి సంకేతాలు అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఈ రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కు భారీగా మెజారిటీ తగ్గిపోవడాన్ని రేవంత్ ప్రముఖంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అంటే వ్యతిరేకత క్రమంగా పెరుగుతోందని, ఈ వాస్తవాన్ని అంగీకరించలేని స్థితిలో టీఆర్ఎస్ నాయకులు ఉన్నారని విమర్శించారు.
ఎప్పుడో ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల ఫలితాలను ఇప్పటికీ చెప్పుకుంటుండడం మీ అతి తెలివికి నిదర్శనం అంటూ కేటీఆర్ పై ధ్వజమెత్తారు. కరీంనగర్, నిజామాబాద్ లో ఓడిపోయింది మీ కుటుంబ సభ్యులే, కానీ, ఓటమి పట్ల కుంటిసాకులు చెబుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. కాగా, హరీశ్ రావుకు ఎంతో పట్టున్న సిద్ధిపేటలో ఈసారి టీఆర్ఎస్ మెజారిటీకి భారీగా గండిపడింది. అటు, కేటీఆర్ సొంతగడ్డలాంటి సిరిసిల్లలో సైతం పెద్దగా మెజారిటీ రాలేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *