రోడ్డు ప్రమాదం లో ఆర్మీ జవాన్ మృతి

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి. కిష్టం పల్లి స్టేజి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లమల ప్రాంతానికి చెందిన ఆర్మీ సైనికుడు సోమ రాజశేఖర్( శివ ) మృతి చెందడం జరిగింది. వంగూరు ఏ.ఎస్.ఐ. విష్ణువర్ధన్ రెడ్డి తెలిపిన వివరాలు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన సోమ రాజశేఖర్ వయసు (38.) ఆర్మీ జవాన్ జమ్మూ కాశ్మీర్ బార్డర్ లో విధులు నిర్వహిస్తున్నాడని సెలవులపై తిరిగి అచ్చంపేటకు తమ సొంత కారులో అతనితోపాటు అతని స్నేహితుడు ఎం.మహేష్. అచ్చంపేట నివాసి. ఇద్దరు వస్తుండగా కోనేటిపురం టోల్ ప్లాజా దగ్గర చూసుకోగా తన ఆర్మీ ఐడెంటిటీ కార్డ్ కనిపించలేదు. వెంటనే కడ్తాల్ టోల్ ప్లాజా దగ్గర తమ ఐడి కార్డులు ఇచ్చి మర్చిపోయానని అని కార్ ను తిరుగు ప్రయాణం చేయగా మార్గమధ్యంలో కృష్ణం పల్లి తండా దగ్గర తనకు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి తమ కారు అదుపుతప్పి చెట్టుకు గుద్ది పల్టీ కొట్టి రోడ్డు కిందకు పడిపోయింది. తలకు చేతులకు కాళ్లకు బలమైన గాయాలు కావడం వల్ల సోమ రాజశేఖర్ అక్కడికక్కడే మరణించడం జరిగింది. కార్ లో ఉన్న మహేష్ కు కూడా తలకు గాయమైంది. చికిత్స నిమిత్తం కల్వకుర్తి లోని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి పంచనామా చేశామని తెలిపారు. విషయం తెలుసుకున్న అచ్చంపేట మాజీ శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ అక్కడికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడి తమ సంతాపాన్ని తెలిపారు. జవాన్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ అతడు చనిపోవడం బాధాకరమని మృతి చెందిన సైనికుడు మనమధ్య లేకపోయినా భౌతికంగా ప్రజలందరి గుండెల్లో భరతమాత గుండెల్లో చిరంజీవిగా చిరస్థాయిగా నిలిచిపోతారని జ్ఞప్తికి చేస్తూ కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ సైనికుడు కుటుంబానికి మేమెప్పుడూ పార్టీ తరఫున అండగా ఉంటామని తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *