మల్కాజిగిరి ఎంపీ గా గెలుపొందిన రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో కృతజ్ఞతా సభ ఏర్పాటు చేశారు. తన గెలుపుకు కృషి చేసిన తెలుగుదేశం, సిపిఐ, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు తన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తన ప్రాణాలు ఉన్నంతవరకు కృషి చేస్తానని…ప్రజల పక్షాన అధికారంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై రాజీలేని పోరాటం చేస్తానని తెలియజేశారు. ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకుగా పోరాడుతానని హామీ ఇచ్చారు.
ప్రజలు కేసీఆర్ పట్టం కట్టి అందలం ఎక్కిస్తే ఆయన పాలన పక్కకు పెట్టి పక్క పార్టీల ఎమ్మెల్యేలను కలుపుకుపోవటంపై దృష్టి పెట్టాడని ఎద్దేవా చేసాడు. తాను దేశములోనే పెద్ద పార్లమెంట్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకుగా తాను పోరాడుతానని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గినని నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలపై పోరాడుతానని ప్రజలకు హామీ ఇచ్చారు.