మేడ్చల్ జిల్లా : జవహర్ నగర్
మంటల్లో స్కూల్ బస్ దగ్ధం
మంటల్లో స్కూల్ బస్ దగ్ధం
మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ లో మంగళవారం సాయంత్రం నోబుల్ హైస్కూల్ అవరణం లో ఆగివున్న AP-28,TA-3807 అనే నెంబరు కలిగిన స్కూల్ బస్ లో అనుకోకుండా మంటలు చెలరేగి మంటల్లో స్కూల్ బస్ పూర్తిగా కాలిపోయిన సంఘటన చోటు చేసుకుంది. వెంటనే స్థానిక బస్తి వాసులు బకెట్ల సహాయం తో నీళ్లు పోసి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు. బుధవారం పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూల్ బస్సులో మంటలు చెలరేగడం పై విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకొన్న జవహర్ నగర్ పోలీసు సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.