లాక్ డౌన్ పూర్తయ్యే లోపే తెలంగాణ లో కేసులు తాగ్గుముఖం పడతాయి : సీఎం కేసీఆర్

తెలంగాణ : రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కొనసాగుతున్న వేల , కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ముఖ్య మంత్రి  ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత తగ్గే అవకాశంఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్, లాక్‌డౌన్‌ అంశాలపై సీఎం కేసీఆర్‌ బుధవారం రాత్రి 11.30 గంటల వరకు ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్‌ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ముఖ్యకార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంతకుమారి, వైద్యాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. కాగా, కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో పరిశీలించడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యాపేట, గద్వాల, వికారాబాద్‌ జిల్లాల్లో ఉన్నతాధికారుల బృందం పర్యటించింది. అనంతరం వారు నేరుగా ప్రగతిభవన్‌చేరుకుని సీఎంకుఅక్కడి పరిస్థితి వివరించారు. ఈ సందర్భంగా సీఎంకేసీఆర్‌.. హైదరాబాద్‌ సహా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. గాంధీఆస్పత్రిలో అందుతున్న చికిత్సవివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అన్ని ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపిస్తున్నాయని వైద్యాధికారులు చెప్పారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *