హైదరాబాద్ :కుషాయిగూడ చర్లపల్లి లోని భారత్ గ్యాస్ రీ ఫిలింగ్ స్టేషన్లో 20 సంవత్సరాలుగా గ్యాస్ సిలిండర్ లోడింగ్ చేసే కార్మికులకు మేనేజర్ హరిబాబు నాయక్ మరియు అడ్మిషన్ ఆఫీసర్ నాగేశ్వరరావు మధ్య ఘర్షణ రావడంతో 10 మంది కార్మికుల ను విధుల నుంచి తొలగించారు కొత్త మేనేజర్ వచ్చినప్పటి నుంచి కార్మికులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .
తొలగించిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని మిగతా కార్మికులు వారికి మద్దతు తెలుపుతున్నారు గత మూడు నెలల నుండి నిరవధిక సమ్మె చేసిన మేనేజ్మెంట్లో చలనం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .
10 మంది కార్మికులు నవీన్ ,వనజ తదితరులు పాల్గొన్నారు కార్మికుల కుటుంబలు రోడ్డున పడిందని పిల్లలకు ఫీజు కట్టలేక స్కూల్ వెళ్లలేని పరిస్థితి మాకు ఆత్మహత్య తప్ప దరి లేదని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు న్యాయం
జరిగేదాకా పోరాటం ఆగదని స్పష్టం చేశారు .