తెలంగాణ : కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పలువురు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. జన సంచారంపై స్పష్టమైన నిషేధాజ్ఞలు ఉన్నా.. ఏదో కారణం చెప్పి బయటకు వస్తున్నారు. పోలీసులు లాఠీలు ఝళిపించినా, కేసులు నమోదు చేసినా, చలానాలు విధించినా.. వీరి తీరులో పెద్దగా మార్పు రాకపోవడం ఆందోళనగా మారింది. ముఖ్యంగా కరోనా కేసులు అధికంగా ఉన్న హాట్స్పాట్ పరిసరాల్లోనూ ప్రజలు ఇష్టానుసారంగా బయటికి రావడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్ డౌన్ ఉల్లంఘనలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 51,100కు పైగా కేసులు నమోదయ్యాయి. 1.21 లక్షల వాహనాలపై కేసులు నమోదు చేసి, సీజ్ చేశారు. . గడిచిన 24 గంటల్లోనే 7,429 వాహనాలపై కేసులు నమోదు చేశారు. మార్చి 22 తర్వాత ఉల్లంఘనలు చేసేవారిపై పోలీసులు లాఠీ ప్రయోగించారు. తర్వాత వేడుకున్నారు.. దండం పెట్టారు.. ఏం చేసినా వీరి తీరులో మార్పు రాకపోవడంతో మరింత కఠినంగా వ్యవహరించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటె విదేశాలలో లాగా భారీ స్థాయిలో జరిమానాలు విధించే అవకాశం ఉంది .