తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాలలో ఇటీవల ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల ప్రశ్నా పత్రాలు లీకేజీ అంశం కలకలం రేపింది. ముఖ్యంగా తెలంగాణలో పేపర్ లీకేజీ కారణంగా పలు మార్లు రద్దు చేశారు. పేపర్ లీకేజీ ఘటన తెలంగాణలో పెద్ద దుమారమే రేపింది. తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా నిరుద్యోగులందరూ ఈ అంశంపై ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్టీలో ఒక బిల్లు ప్రవేశ పెట్టింది. పోటీ పరీక్షల్లో అక్రమాలు, అవకతవకలు చేసిన వారికి పదేళ్ల జైలు, పది లక్షలు జరిమానా శిక్ష విధించేలా కర్ణాటక అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది. ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినందున ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి చర్యలే తీసుకునే అవకాశం ఉంది.