పపువా న్యూ గినియాలో అగ్నిపర్వతం బద్దలవడంతో అక్కడ భారీ నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో భారత్ న్యూగినియాకి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఎనిమిది కోట్ల రూపాయలను సహాయనిధి కింద భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగ భారత్కు పపువా న్యూ గినియాకి మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే భారత్ వెంటనే మిత్ర దేశానికి సంఘీభావం ప్రకటించింది. ఆ దేశం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులపై సంతాపం వ్యక్తం చేసింది.