సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసిన పథకాలివే..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల పై తొలి సంతకం చేశారు. వాటి వివరాలిలా ఉన్నాయి. మహాలక్ష్మి పథకం – పేద మహిళలకు నెలకు రూ. 2,500. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్. గృహజ్యోతి – ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. రైతు భరోసా – రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000. వ్యవసాయ కూలీలకు రూ. 12,000. వరి పంటకు రూ 500 బోనస్. యువ వికాసం – ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు. చేయూత – రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా రూ. 10 లక్షలు. నెలవారీ పింఛను రూ. 4,000. ఇందిరమ్మ ఇళ్లు – ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ. 5 లక్షలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *