నాలుగు రోజులపాటు నిర్మల్ పట్టణంలో పూర్తిగా లాక్ డౌన్

 నిర్మల్ పట్టణంలో నేటి నుండి నాలుగు రోజులపాటు పూర్తిగా లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అన్నారు.గురువారం కలెక్టర్ చాంబర్ లో పోలీస్, వైద్య ,మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మల్ పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు శుక్రవారం నుండి నాలుగు రోజుల పాటు పూర్తిగా లార్డ్ ఆన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. అంబులెన్స్ సేవలు, నిత్యావసర సరుకుల వాహనాలకు తప్ప వేరే ఏ ఇతర టు వీలర్ గాని, ఫోర్ వీలర్ లకు అనుమతి లేదన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం లో ఉన్న కూరగాయల మార్కెట్ ను పూర్తిగా మూసివేసి వేరు వేరు ప్రదేశాలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వైద్య బృందాలు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తాయని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు, జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, డి.ఎస్.పి ఉపేందర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వసంతరావు, జిల్లా ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ దేవేందర్ రెడ్డి, జిల్లా కరోనా నియంత్రణ నోడల్ అధికారి డాక్టర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *