కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, నిర్మల్ పట్టణంలో రేపటి నుండి నాలుగు రోజులు పూర్తిగా లాక్ డౌన్ విధిస్తూన్నట్టు జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. జిల్లా కేంద్రంలో కరోనా నివారణకై మరింత కట్టుదిట్టమైన
చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. అంబులెన్స్, నిత్యవస సరుకుల వాహనాలు మినహా టూ వీలర్, ఫోర్ వీలర్ బయటకి వెళ్లడానికి అనుమతి లేదన్నారు. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కూరగాయల మార్కెట్
మూసివేసారు. వైద్య బృందాలు ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టాలని ఆదేశించారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠింమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.