సాగర్ వివాదంపై నేడు కేంద్రం భేటీ..

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నాగార్జున సాగర్ వివాదం నేపథ్యంలో నేడు కేంద్రం కీలక భేటీ నిర్వహించనుంది. ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, సీఎస్‌లు, KRMB ఛైర్మన్‌తో జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ భేటీ అవుతారు. ఈ విషయంపై కీలకంగా చర్చలు జరుపుతారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల నిర్వహణ, సామరస్యంగా తాగు, సాగు నీటి విడుదలకు వీలుగా సూచనలు ఇవ్వనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *