అవుకు టన్నెల్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌..

గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను సీఎం జగన్‌ గురువారం జాతికి అంకితం చేశారు. దీంతో ప్రస్తుత డిజైన్‌ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగ‌మమైంది. శ్రీశైలానికి వరద వచ్చే సమయంలో రోజుకు 20 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను తరలించి.. రాయ‌ల‌సీమ‌, నెల్లూరు జిల్లాల‌కు సాగు, తాగు నీటిని అందించేందుకు గాలేరు–నగరి సుజల స్రవంతిని చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *