తేది:03-01-2026 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం
గణపురం మండల కేంద్రం లో సావిత్రి భాయి ఫూలే సేవలు మరువలేనివని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు దూలం కుమారస్వామి గౌడ్ అన్నారు.శనివారం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సావిత్రి భాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం మహిళా ఉపాధ్యాయిని స్వర్ణలత ను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జలంధర్ శ్రీధర్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.