తెలంగాణలో కాసేపటి క్రితం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసిందని, రాష్ట్రంలో ఎక్కడైన ఎన్నికల ప్రవర్తనా నియమావళి, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఈవో హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ. తెలంగాణలో 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వారిలో 1,62,98,418 మంది పురుషులు, 1,63,01,750 మంది మహిళా ఓటర్లు ఉన్నారని తెలిపారు. థర్డ్ జెండర్ ఓటర్లు 2,676 మంది, సర్వీస్ ఓటర్లు 15,406, ఓవర్సీస్ ఓటర్లు 2,944 మంది ఉన్నారని వికాస్ రాజ్ తెలిపారు.