కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఇద్దరు ఐఏఎస్లకు నెల రోజుల జైలు శిక్ష పడింది. జె. శ్యామలరావు, పోలా భాస్కర్కు హైకోర్టు జైలు శిక్ష విధించింది. ఇద్దరు ఐఏఎస్లకు రూ. వెయ్యి చొప్పున హైకోర్టు జరిమానా విధించింది. నీరు-చెట్టు అంశంపై హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారని ఈ చర్యలు తీసుకుంది. వచ్చే నెల 8లోపు రిజిస్ట్రార్ జ్యుడీషియల్ వద్ద లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది.