‘యువగళం’లో ఓ విద్యార్థి ఆవేదనను విన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ఆ తమ్ముడ్ని చదివించే బాధ్యత తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు. అమలాపురానికి చెందిన కె.దుర్గారెడ్డి కుటుంబానికి ఆర్థిక స్థోమత లేక ఇంటి వద్దే ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాను అని చెప్పాడు. దీంతో లోకేశ్ స్పందిస్తూ దుర్గారెడ్డిని తాను చదివిస్తానని అక్కడికక్కడే ప్రకటించారు. విద్యార్థి వివరాలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.