తెలంగాణ రాష్ట్రంలో ఈ పదేళ్లలో ఏం మార్పు వచ్చిందో బేరీజు వేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. వికారాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. కంటి వెలుగు కార్యక్రమం కింద 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించాం. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ధరణి ఉండాలంటే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలనే గెలిపించాలి. ధరణి తీసేస్తే మళ్లీ లంచాల కాలం వస్తుంది. ఎన్నికలు రానే వచ్చినట్లు అబద్దాలు చెప్తున్నారు. ఎన్నికల్లో అభ్యర్థులతో పాటు వారి పార్టీ చరిత్ర కూడా చూడాలి.ప్రజల గురించి ఏ పార్టీ ఎలా ఆలోచిస్తుందో గమనించి ఓటు వేయాలి” అని కేసీఆర్ పేర్కొన్నారు.