తెలంగాణను అభివృద్ధి చేయడం కంటే అప్పుల కూపీలోకి తీసుకెళ్లారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఇవాళ సంగారెడ్డి సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. “కల్వకుంట్ల కుటుంబ దోపిడీ తెలంగాణలో సాగుతుంది. కేసీఆర్ పాలనలో భారీ అవినీతి జరిగింది. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని కేసీఆర్ అంటున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసేస్తాం. బీఆర్ఎస్ అంటే భారత రాక్షస సమితి. ధరణితో పేదల భూములు గుంజుకున్నారు.” అని జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.