రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.
ఈ క్రమంలో ఇవాళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదును మాదాపూర్ ఎస్ఓటి, గచ్చిబౌలి పోలీసులు వాహనాల తనిఖీలలో గుర్తించినట్లు తెలిపారు. కొండాపూర్ బొటానికల్ రోడ్ నుండి చిరెక్ పబ్లిక్ స్కూల్ పైపు బ్రీజా కార్లో నగదును గుర్తుతెలియని వ్యక్తులు తరలిస్తున్నట్లు అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేయగా కారులో రెండు సంచుల్లో ఐదు కోట్ల రూపాయల నగదును గుర్తించినట్లు తెలియజేసారు.