విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి సీఎం జగన్ పరిహారం ప్రకటించారు. బోట్ల విలువలో 80 శాతం పరిహారం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారుల జీవితాలను నిలబెట్టేలా సహాయం అందించాలని ఆదేశించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో దాదాపు 40కి పైగా మత్స్యకారుల బోట్లు దగ్ధమైన విషయం తెలిసిందే.